నల్ల సూరీడు 'ఉదయించిన' రోజు
నల్ల సూరీడు, నల్ల జాతి హక్కుల రక్షణకోసం పోరాడిన మహానుభావుడు నెల్సన్ మండేలా పుట్టిన రోజు నేడు. ప్రత్యర్థిని అగౌరవ పరచకుండానే వారిపై విజయం సాధించిన నేత. అందుకే ఆయన ప్రపంచానికే ఆదర్శప్రాయుడయ్యారు. జాతి వివక్షకు చరమగీతం పాడారు.
జాతిని ఏకం చేసిన మండేలా ప్రసంగాలు...
జాతిని ఏకం చేయడం కోసం మండేలా తీవ్ర కృషి చేశారు. ఆయన ప్రసంగాలు జాతిని ప్రభావితం చేశాయి. 'ఎక్కడైనా మనుషులు మాత్రమే ఉంటారు. వ్యవస్థలు, విధానాలు మనుషుల్ని చెడ్డవాళ్లుగా, శత్రువులుగా చిత్రీకరిస్తాయని' తెలిపాడు. జాతి వివక్ష అమాయక ప్రజలను బలి తీసుకుంటుందని, వివక్షను పాటించేవారు కూడా తమ సొంత మనుషులను కోల్పోవాల్సి వస్తుందని తెల్ల అధికారులకు అర్థమయ్యేలా చెప్పగలిగారు నెల్సన్ మండేలా. 'జీవితాన్ని మీరెంతగా ప్రేమించారో నేనూ అంతే ప్రేమించాను. స్వేచ్ఛగా జీవించాలన్న మీ హక్కు, నా హక్కు వేర్వేరు కాదు' అని చెప్పి తన జాతికి నమ్మకాన్ని, ధీమాను కల్పించిన మహానుభావుడు మండేలా'.
Post a Comment