ప్రళయం సైతం తట్టుకుని నిలబడేది కాశి మాత్రమే! ఎందుకో తెలుసా?



ప్రళయం వస్తే ఏదీ మిగలదు అని చెబుతారు. కాని ఒక ప్రదేశం మాత్రం దాన్ని సైతం తట్టుకుని నిలబదతుందని వేద పండితులు అంటున్నారు. ఆ లయకారకుడైన పరమేశ్వరుని చేత ప్రతిష్టితమైన వారణాసినే ఆ ప్రదేశమని, అంత గొప్ప ప్రదేశం భారతదేశంలోనే ఉండటం ఎంతో గొప్ప విషయమని వేద పండితులు అంటున్నారు. యావత్‌ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించగా ..


కల్పాంతం తరువాత ప్రళయం ఏర్పడుతుంది. వారణాసిని మాత్రం ఆ లయకారుడైన శంభునాధుడు సృష్టించాడు. అందుకే..

ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెడుతాడని నమ్మకం.


పరమేశ్వరుని చేత ఈ నగరం ప్రతిష్టితమైనదని అందుకనే ఎలాంటి ప్రళయాలు సంభవించినా ఆ నగరాన్ని మాత్రం నాశనం చేయలేవని కూడా శాస్త్రాలు ఘంటాపథంగా పలుకుతున్నాయి. 

No comments